ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నడో: MLA ధర్మారెడ్డి
ABN , First Publish Date - 2021-10-23T22:42:58+05:30 IST
బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంతకు ఏ పార్టీలో ఉన్నడో తెల్వదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హనుమకొండ: బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంతకు ఏ పార్టీలో ఉన్నడో తెల్వదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జిల్లా పరిధిలోని హుజురాబాద్ నియోజవర్గంలోని కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలో ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈటల స్వార్థం కోసమే హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన ఆరోపించారు. దళిత బంధును ఆపేందుకు లేఖ రాసింది నిజమో, కాదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడులో కిషన్ రెడ్డి డ్రామా ఆడించారని ఆయన ఆరోపించారు. పోలీసు అధికారిని కొట్టింది బీజేపీ కార్యకర్తే అని ఆయన పేర్కొన్నారు. ఈటల రాజేందర్ గెలిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. నిలబడ్డ చెట్టును నరుక్కున్న స్వార్థపరుడు ఈటల రాజేందర్ అని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేదన్నారు. కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ టచ్లో ఉన్నాడన్నారు. అందుకే బీజేపీ నేతల నుంచి ఈటల రాజేందర్కు సహకారం అందడం లేదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు.