యాదాద్రి ఆలయానికి కిలో బంగారం విరాళంగా ప్రకటించిన దానం
ABN , First Publish Date - 2021-10-21T23:56:39+05:30 IST
యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విమానగోపురం బంగారు తాపడం చేయడానికి తన వంతుగా కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు.
హైదరాబాద్: యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విమానగోపురం బంగారు తాపడం చేయడానికి తన వంతుగా కిలో బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. ఆదునిక చరిత్రలో ప్రజా పరిపాలకుడు ఇంత గొప్ప వైభవంగా ఒక ఆలయాన్ని పునర్నిర్మించడం ఒక అధ్భుతమని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. తన కుటుంబం, శ్రీని ఫార్మాగ్రూప్ కంపెనీ తరపున ఆలయానికి ఆందజేయనున్నట్టు తెలిపారు. ఒక గొప్ప సంకల్పానికి తాను ప్రేరణను, సంతోషాన్ని పొందినట్టు తెలిపారు.