మంత్రి తలసానిని కలిసిన సాగర్ ఎమ్మెల్యే భగత్
ABN , First Publish Date - 2021-05-05T19:43:43+05:30 IST
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో్ల విజయం సాధించిన నోముల భగత్ బుధవారం పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను

హైదరాబాద్: ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో్ల విజయం సాధించిన నోముల భగత్ బుధవారం పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి తలసాని సాగర్ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నోముల భగత్
గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఇంటింటి ప్రచారంతోపాటు రోడ్ షోలు, వివిధ కుల, ప్రజా సంఘాలతో సమావేశాలు నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ ను గెలిపించేందుకు ప్రయత్నించారు. దాదాపు తానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా మంత్రి తలసాని భగత్ విజయం కోసం పాటు పడ్డారు. తన విజయానికి పాటుపడ్డ మంత్రి తలసానిని ఎమ్మెల్యే భగత్ శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.