తెలంగాణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తాం: తలసాని

ABN , First Publish Date - 2021-12-15T20:42:54+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూకన్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

తెలంగాణలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తాం: తలసాని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూకన్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ క్రిస్మస్ ను ఎంతో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద క్రిస్టియన్లకు దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. 


ప్రభుత్వ ఫరంగా 10 వేల మందికి ఎల్బీ స్టేడియంలో విందు నిర్వహిస్తున్న విషయాన్నిమంత్రి గుర్తు చేశారు. పేద క్రిస్టియన్లకు దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని రెండు, మూడు రోజులలో పూర్తి చేయాలని కోరారు. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా క్రిస్టియన్ లు ఉన్నారని, అందుకు అనుగుణంగా దుస్తులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ విందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-12-15T20:42:54+05:30 IST