బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన అంబేద్కర్:తలసాని

ABN , First Publish Date - 2021-04-14T19:43:27+05:30 IST

బడుగు బలహీన వర్గాల మనసులలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేడ్కర్ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన అంబేద్కర్:తలసాని

నాగర్జున సాగర్: బడుగు బలహీన వర్గాల మనసులలో  చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేడ్కర్ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 130 వ జయంతి సందర్భంగా మంత్రి తలసాని కరీంనగర్ మేయర్, ఉప ఎన్నికల ఇంచార్జి సునీల్ రావ్ లు నాగార్జున సాగర్ హిల్ కాలనీ బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేలా అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం వలన అనేక మంది ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. చట్టసభలలో ఇతర రంగాలలో ఆయా వర్గాలకు రావాల్సిన హక్కులు, రిజర్వేషన్ ల గురించి రాజ్యాంగం లో వివరించడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలు సైతం అంబెడ్కర్ ను స్ఫూర్తి గా తీసుకుంటున్నాయని ఆయన కొనియాడారు. 

Updated Date - 2021-04-14T19:43:27+05:30 IST