గీత కార్మికుల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-05-09T01:13:08+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం గా పని చేస్దున్నారని అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

గీత కార్మికుల సంక్షేమం, అభివృద్దే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం గా పని చేస్దున్నారని  అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్ర భుత్వం అమలు చేస్తున్న పలు పధకాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేపడుతున్న కార్యక్రమాలపై అందుబాటులో ఉన్న గౌడ సామజిక శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఆబ్కారీ శాఖ అధికారులతో చర్చించారు. సీఎం కేసీఆర్ గీత కార్మికులకు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగ వైకల్యం చెందిన వారికి అందించే ఎక్స్గ్రేషియా   2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచినట్టు తెలిపారు. పెంచిన ఎక్స్గ్రేషియాను రైతులకు అందిస్తున్న రైతు బీమా మాదిరిగా వెంటనే గీత కార్మికుల కుటుంబానికి అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


ప్రమాదవశాత్తు గీత కార్మికులు చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం చెందిన కార్మికుల సమాచారం 24 గంటల వ్యవధిలో సేకరించి వారం రోజులలో విచారణ పూర్తి చేసి రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ కు అందించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. చనిపోయిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు చెల్లించే ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రం లో  ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నీరా ఉత్పత్తి ని గీత వృత్తిదారులు(గౌడ కులస్తులు) మాత్రమే ఉత్పత్తి చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం మన్నారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న నీరా కేఫ్ పనుల పురోగతి పై రూడా మంత్రి చర్చించారు. 


నీరా కేఫ్, నందనం లో నీరా మరియు దాని ఉప ఉత్పత్తల తయారీ కేంద్రాలు నిర్మాణ పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రం లో  ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ నర్సరీలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నర్సరీలలో హైబ్రిడ్ తాటి, ఈత, ఖర్జుర, గిరక తాళ్ల చెట్లు (డాలర్ ట్రీ) మొక్కలను తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి గీత కార్మికులకు గీత కార్మికులకు పెన్షన్లు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అందేలా చూడాలని ఆబ్కారీ శాఖ అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. 

Updated Date - 2021-05-09T01:13:08+05:30 IST