గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం

ABN , First Publish Date - 2021-07-13T01:19:04+05:30 IST

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోని అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన మహిళ సమాఖ్య కు చెందిన

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం

మహబూబ్ నగర్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కు మహబూబ్ నగర్ జిల్లాలోని దేశంలోని అతిపెద్ద కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ ( 2097 ఎకరాలు) వేదికైంది. జిల్లాకు చెందిన మహిళ సమాఖ్య కు చెందిన మహిళలు 10 రోజుల్లో2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి వాటిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ లోని మైదాన ప్రాంతాల్లో వేద జల్లే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. 


విజయవంతం గా 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ ను వెదజల్లి చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ కేసీఆర్ ఎకో పార్క్ లో జిల్లాకు చెందిన మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలోఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో ఎక్కడలేని విధంగా 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి వాటిని  విజయవంతం గా వెదజెల్లే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గా నమోదు అయ్యింది. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కు కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ వేదికగా నిలిచింది. అనంతరం పట్టణంలో ని రైల్వే ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో మంత్రి  శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్ గిన్నిస్ బుక్ ఆఫ్ ఛాలెంజ్ కార్యక్రమం ను పరిశీలించారు. 


ఈ చారిత్రాత్మక ఘట్టానికి కృషి చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్ లు, జిల్లా అధికార యంత్రాంగం కు , పీజెడ్ఎంఎస్, డిఆర్ డిఏ, మెప్మా, హెటెరో గ్రూప్, జిల్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బృందానికి మంత్రి  శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి వాటిని  విజయవంతం గా వెదజల్లి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించినందుకు ఈ రికార్డ్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అంకితం ఇస్తునట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. వెంకటరావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T01:19:04+05:30 IST