త్వరలో కొత్త పెన్షన్‌లు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-08T23:57:01+05:30 IST

రాష్ట్రంలోని 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్‌లు ఇస్తామని మంత్రి వేముల

త్వరలో కొత్త పెన్షన్‌లు: మంత్రి ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి: రాష్ట్రంలోని 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్‌లు ఇస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గత ఐదేళ్లుగా మొక్కలు నాటడంతో 4.6 శాతం హరిత సంపద పెరిగిందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారం అంటే గుంజుకుంటే వచ్చేది కాదని, ప్రజలు ప్రేమతో ఇచ్చేదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. 



ప్యాకేజ్ 22 ద్వారా మంచిప్ప నుంచి కామారెడ్డి నియోజకవర్గానికి సాగు నీరు తీసుకురావడానికి తాను బాధ్యత తీసుకుంటానని మంత్రి  ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్ళ నిర్మాణానికి ఇచ్చిన డబ్బుల కంటే ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ నిర్మాణాలకు 7 రెట్లు అదనంగా ఇస్తుందని ఆయన తెలిపారు. గత పర్యటనలో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. వాటికి సంబంధించిన జీఓ ఈ రోజున విడుదలయిందని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-08T23:57:01+05:30 IST