నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ ట్వీట్
ABN , First Publish Date - 2021-09-16T17:20:13+05:30 IST
ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంపై తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆరేళ్ల చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంపై తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందంటూ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. నిందితుడు రాజు మృతదేహం స్టేషన్ ఘన్పూర్ రైల్వేట్రాక్పై ఉన్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తనకు సమాచారం ఇచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ఇక ఇదే విషయంపై తెలంగాణ డీజీపీ కూడా అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన చేశారు. చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ ధ్రువీకరించారు. రాజు శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. రాజు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని డీజీపీ పేర్కొన్నారు.