పని చేయబోమని కేంద్రమంత్రులే చెప్పారు: మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2021-10-22T23:15:13+05:30 IST
ప్రజలకు తాము మాటలు చెబుతాం తప్ప, పని చేయబోమని
హుజురాబాద్: ప్రజలకు తాము మాటలు చెబుతాం తప్ప, పని చేయబోమని కేంద్రమంత్రులే చెప్పారని బీజేపీ నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదని హరీష్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు. మరి రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పుకోగలదా అని ఆయన నిలదీసారు. ప్రజలను వంచించడంలో బీజేపీని మించినవారు లేరని హరీష్రావు ఆరోపించారు.