ఢిల్లీవాళ్లు వ్యంగ్యంగా మాట్లాడారు: మంత్రి గంగుల
ABN , First Publish Date - 2021-11-10T02:07:33+05:30 IST
వరి ధాన్యం కొనాలని ఢిల్లీలో తాము కేంద్ర మంత్రులను కలిస్తే
హైదరాబాద్: వరి ధాన్యం కొనాలని ఢిల్లీలో తాము కేంద్ర మంత్రులను కలిస్తే వ్యంగ్యంగా మాట్లాడారని పౌర సరఫరాల శాఖా మంత్రి మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సెప్టెంబర్ 1న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను తాము కలిశామన్నారు. నాలుగేళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ ఉందని, ధాన్యాన్ని తాము తీసుకోబోమని గోయల్ చెప్పారని మంత్రి గంగుల పేర్కొన్నారు. కష్టాల నుంచి ఆదుకోవాలంటే ఢిల్లీవాళ్లు వ్యంగ్యంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ధాన్యం కొనుగోలు కోసం గన్నీ బ్యాగ్లు ఇవ్వకుండా, ప్రైవేట్లో కొనకుండా అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి బాధ్యత ఉంటే తమతో ధర్నాలో పాల్గొనాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు.