ఢిల్లీలో పడిగాపులు పడడం వల్లనే కరోనా సోకింది: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-12-26T19:55:12+05:30 IST

రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడం పై రాత పూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఢిల్లీలో పడిగాపులు పడడం వల్లనే కరోనా సోకింది: ఎర్రబెల్లి

హైదరాబాద్: రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడం పై రాత పూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని  పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం  రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.అయితే, గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు వహిస్తూ, వీలైనంత వరకు హోమ్  క్వారంటైన్ లో ఉండాలని కోరారు. 


కాగా మంత్రి ఎర్రబెల్లి ఐసోలేషన్ లో ఉండడంతో నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పి ఏ లు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్ లో, అటు హన్మకొండ, పాలకుర్తి, ఇతర మండల కేంద్రాల్లో అధికారులు, పీ ఏ లు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, ప్రజలు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-12-26T19:55:12+05:30 IST