జిల్లా, మండల పరిషత్ లకు రూ.250 కోట్ల నిధుల విడుదల

ABN , First Publish Date - 2021-12-05T20:10:21+05:30 IST

స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసిఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ లకు తాజాగా 250 కోట్ల నిధులను విడుదల చేసింది.

జిల్లా, మండల పరిషత్ లకు రూ.250 కోట్ల నిధుల విడుదల

హైదరాబాద్: స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసిఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ లకు తాజాగా 250 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ లకు 125 కోట్ల 87 లక్షల 50 వేల 500 రూపాయలు, మండల పరిషత్ లకు 124 కోట్ల 12 లక్షల 49వేల 500 రూపాయలు విడుదల అయ్యాయి.


కాగా,ఈ నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసిఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.ఈ నిధులను జిల్లా, మండల పరిషత్ ల అభివృద్ధి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-12-05T20:10:21+05:30 IST