ఆనాటి కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం:ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-11-29T01:03:48+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టీ, 'తెలంగాణ వచ్చుడో... కేసిఆర్ సచ్చుడో' అనే నినాదంతో నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేశారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఆనాటి కేసీఆర్ దీక్ష వల్లే  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం:ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టీ, 'తెలంగాణ వచ్చుడో... కేసిఆర్ సచ్చుడో' అనే నినాదంతో నవంబర్ 29, 2009 న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేశారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని, చరిత్ర గతినే మార్చి వేసింది నవంబరు, 29వ తేదీ అని ఆయన అన్నారు. అప్పటి దాకా శాంతియుతంగా నడుస్తున్న ఉద్యమానికి, ఒక సత్యాగ్రహ ఆయుధం లా మారిందన్నారు. 


మొత్తం ప్రజలని ఏకం చేసి, ఆనాటి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిన ఆనాటి కేసిఆర్ దీక్ష చేపట్టిన రోజుని దీక్షా దివస్ గా జరుపుకోవడం, ఆనాటి ఆ కేసిఆర్ త్యాగ నిరతిని గుర్తు చేసుకోవడమే అన్నారు. ఈ రోజు కి దీక్షా దివస్ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అప్పటి ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తే ఒళ్ళు పులకరిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను కూడా మరువలేమని మంత్రి అన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ సీఎం గా తెలంగాణను అదే ఉద్యమ స్ఫూర్తి తో బంగారు తెలంగాణ చేస్తున్నారని చెప్పారు. 

Updated Date - 2021-11-29T01:03:48+05:30 IST