మంత్రి ఎర్రబెల్లిని సన్మానించిన ఎంపిడీఓల సంఘం

ABN , First Publish Date - 2021-04-18T22:36:33+05:30 IST

ఇటీవల ఈ పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పొందిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఎంపిడిఓ

మంత్రి ఎర్రబెల్లిని సన్మానించిన ఎంపిడీఓల సంఘం

వరంగల్: ఇటీవల ఈ పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పొందిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఎంపిడిఓ, జెడ్పీ సీఈఓ ల సంఘాల నేతలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, సన్మానించారు.ఈ సందర్భంగా తమ పదోన్నతుల గురించి మంత్రి కి వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సి ఈ ఓ లకు సీఈఓ లుగా పదోన్నతులు కల్పించిందున 76 మంది ఎంపిడిఓ లకు డిప్యూటీ సి ఈ ఓ లుగా పదోన్నతులు ఇవ్వాలని వారు కోరారు.మంత్రి ని కలిసిన వారిలో జెడ్పీ సీఈవో ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ రావు, ఎంపిడిఓ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య, డీఆర్ డిఓ సంఘాల నేతలు ఉన్నారు.

Updated Date - 2021-04-18T22:36:33+05:30 IST