మహాగాంను సందర్శించిన మంత్రి అల్లోల
ABN , First Publish Date - 2021-03-14T07:51:51+05:30 IST
నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శనివారం పర్యటించారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో రెండు ఆటోలు, ఓ హోటల్ను తగలబెట్టిన విషయం తెలిసిందే.
![మహాగాంను సందర్శించిన మంత్రి అల్లోల](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భైంసా రూరల్, మార్చి 13 : నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శనివారం పర్యటించారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో రెండు ఆటోలు, ఓ హోటల్ను తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సందర్శించిన మంత్రి, బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే సహించేది లేదన్నారు.