Hyderabad: శుభవార్త చెప్పిన టీఆర్టీసీ Md. Sajjanar
ABN , First Publish Date - 2021-10-10T17:43:38+05:30 IST
దసరా పండుగలకు వెళ్తున్న ప్రయాణికులకు తెలంగాణ టీఆర్ఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీలో పెంచిన అదనపు చార్జీలను ఎత్తివేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఉన్న సాధారణ ఛార్జీలు వసూలు
హైదరాబాద్: దసరా పండుగలకు వెళ్తున్న ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీలో పెంచిన అదనపు చార్జీలను ఎత్తివేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పుడు ఉన్న సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులపై అదనపు భారం వద్దని, ఇప్పటి వరకు తీసుకున్న రిజర్వేషన్ల టికెట్లు, అదనపు చార్జీలను వెనక్కి తీసుకోవాలని సజ్జనార్ ఆదేశించారు.