గిరిజన గురుకులంలో వంట పనుల్లో విద్యార్థినులు

ABN , First Publish Date - 2021-10-29T05:15:49+05:30 IST

గిరిజన గురుకులంలో వంట పనుల్లో విద్యార్థినులు

గిరిజన గురుకులంలో వంట పనుల్లో విద్యార్థినులు
కేసముద్రం గిరిజన బాలిక గురుకుల పాఠశాలలో వంట పనుల్లో విద్యార్థినులు

కేసముద్రం, అక్టోబరు 28 : నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు నెలకొల్పిన గురుకుల పాఠశాలలో వంట మనుషులు చేయాల్సిన పనులను విద్యార్థినులతో చేయిస్తున్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో కొద్దిరోజులుగా విద్యార్థినులతోనే కూరగాయ లు కడగడం, కోయించే పనులను చేస్తున్నట్లు ఫొటోలు సామాజిక మాధ్యమంలో రావడంతో చర్చనీయాంశంగా మారింది. కొవిడ్‌ సెలవుల అనంతరం ఈనెల 18న గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వంట చేయించే కాంట్రాక్టరు పని మనుషులను ఏర్పాటు చేయకుండా కొద్దిరోజులుగా విద్యార్థినులతోనే పనులు చేయిస్తున్నట్లు పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాజాగా గురువారం కొత్త కాంట్రాక్టు కోసం ఏటూరునాగారంలో టెండర్లు ఖరారు చేశారు. కాంట్రాక్టును మళ్లీ దక్కించుకునే బీజీలో కాంట్రాక్టరు ఉండగా హాస్టల్‌లో పనిమనుషులు లేక విద్యార్థినులు పనులు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవిషయంపై ప్రిన్సి పాల్‌ శైలజారాణిని వివరణ కోరగా మా హాస్టల్‌లో విద్యార్థులు ఎవరూ పనిచేయడంలేదని, విధి నిర్వహణలో తాను ఏటూరునాగారంలో ఉన్నానని తెలిపారు.

 

Updated Date - 2021-10-29T05:15:49+05:30 IST