హైదరాబాద్ ను ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్‘గా తీర్చిదిద్దుతున్నాం

ABN , First Publish Date - 2021-10-30T02:24:39+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గ్రీనరికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతున్నదని, అందులో భాగంగానే 987 పార్కులు, 700 ట్రీ పార్కులు, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ డెవలప్ మెంట్,

హైదరాబాద్ ను ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్‘గా తీర్చిదిద్దుతున్నాం

హైదరాబాద్: గ్రేటర్  హైదరాబాద్ నగరంలో గ్రీనరికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతున్నదని,  అందులో భాగంగానే 987 పార్కులు, 700 ట్రీ పార్కులు, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ డెవలప్ మెంట్, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, ప్రజలకు ఉచితంగా మొక్కల పంపిణీ, 119 అర్బన్ పారెస్ట్ లను అభివృద్ది చేస్తున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో రాజధాని హైదరాబాద్ కు ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్ గా,‘‘ గుర్తింపు వచ్చిందని నగర మేయర్ తెలిపారు. అర్భన్ గ్రీనరి, హెల్దీయర్, హ్యాపీయర్ ప్లేసెస్ అంశంపై ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఏసియా, పసిపిక్ (ఎఫ్ఏఓ,ఆర్ఏపి) సంయుక్తంగా ఏర్పాటు చేసిన మూడవ ఏసియా - పసిపిక్ అర్భన్ ఫారెస్ట్రీ సమావేశంలో ఏసియా పసిపిక్ దేశాలైన ఇండోనేషియా, ఛైనా, బ్యాంకాక్ తదితర దేశాల ప్రతినిధులతో మేయర్ విజయలక్ష్మి గూగుల్ మీట్  ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు. 


దేశం నుండి నగర మేయర్ కు మాత్రమే ఈ ఆన్ లైన్ సమావేశంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 119 అర్బన్ ఫారెస్ట్రీ బ్లాక్ లను ఏర్పాటు చేసి అభివృద్ది చేయడం ప్రపంచంలో మరెక్కడాలేదని, 185 చెరువులలో చెరువులు, కుంటలలో బఫర్ జోన్ ప్లాంటేషన్ మొక్కలు నాటేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 42 చెరువుల వద్ద మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కల నాటే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారని, తెలంగాణ ఏర్పడినప్పుడు అడవులు 24 శాతమే ఉండగా 33 శాతానికి పెంచే సంకల్పంతో ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదని చెప్పారు. 


ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం కోసం ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడమేకాకుండా పర్యావరణ పరిరక్షనకు దోహదపడుతున్నాయని, దేశంలో మరెక్కడాలేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తీరును అందరూ ప్రశంసిస్తున్నారని స్థానిక సంస్థలైన పంచాయితీరాజ్, మున్సిపాలిటీ, నగర పాలక సంస్థలు ప్రత్యేక గ్రీనరీ బడ్జెట్ రూపొందించారని, స్థానిక సంస్థలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులలో పది శాతం నిధులను గ్రీనరి కోసమే వినియోగించుకునేవిధంగా ప్రభుత్వం చట్టం చేసిందని, గ్రామీణం, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయడంతోపాటు నాటిన మొక్కలు 90శాతం బ్రతికుండేలా చర్యలు తీసుకున్నదని వివరించారు.

Updated Date - 2021-10-30T02:24:39+05:30 IST