బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కటే: మాణిక్యం ఠాకూర్‌

ABN , First Publish Date - 2021-09-19T01:23:18+05:30 IST

బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని, సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో ప్రధాని మోదీతో దోస్తీ కడతాడని, హైదరాబాద్‌ వచ్చి దుమ్మెత్తిపోస్తాడని

బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కటే: మాణిక్యం ఠాకూర్‌

పరిగి: బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని, సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో ప్రధాని మోదీతో దోస్తీ కడతాడని, హైదరాబాద్‌ వచ్చి దుమ్మెత్తిపోస్తాడని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యంఠాకూర్‌ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ నాటకాన్ని గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మాయమాటలకు జనం విసిగిపోయారని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్‌ ప్రజలకు అర్థమైపోయిందని చెప్పారు. బీజేపీ మతం పేరిట రెచ్చగొట్టడం, టీఆర్‌ఎస్‌ మోసపూరిత మాటలు ఎంతకాలం ప్రజలు నమ్మరని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అయితే.. అనుభవిస్తున్నది, దోచుకుంటున్నది కేసీఆర్‌ కుటుంబమేనని ఆరోపించారు. డబ్బులతో రాజకీయాలు ఎక్కువకాలం మనుగలేవని, కేసీఆర్‌ పతనం ఆరంభమైందని మాణిక్యం ఠాకూర్‌ అన్నారు. 

Updated Date - 2021-09-19T01:23:18+05:30 IST