కరోనా కట్టడిపై కేసీఆర్కు లేఖాస్త్రాలు
ABN , First Publish Date - 2021-05-08T13:05:03+05:30 IST
కరోనాను కట్టడం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని

హైదరాబాద్ : కరోనాను కట్టడం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతూ పలువురు ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖలు రాశారు. వ్యాధి నిరోధంలో ప్రభుత్వం అయోమయంలో పడిందని బీజేపీ నేత, సినీనటి విజయశాంతి పేర్కొనగా, రోగుల ప్రాణాలు కాపాడాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కార్మికులకు ఆర్టీసీ ఆస్పత్రిలో ఐసోలేషన్వార్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు మురళీధర్ గుప్తా లేఖలను రాశారు.