భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-04-16T06:55:38+05:30 IST
భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
జెన్కో అధికారులతో జడ్పీ చైర్పర్సన్లు
మల్హర్, ఏప్రిల్ : జెన్కో భూ ఉపరితల బొగ్గు గనుల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి అన్నారు. భూపాలపల్లిలో క్యాంపు కార్యాలయంలో నిర్వాసితులు, జెన్కో అధికారులతో వారు గురువారం సమావేశమమయ్యారు. తాడిచర్ల, కాపురం గ్రామాల నిర్వాసితులకు అన్యాయం చేయొద్దన్నారు. దీనిపై జోన్కో ఎస్ఈ తిరుపతయ్య మాట్లాడుతూ డేంజర్లోని 500 మీటర్ల భూ సేకరణకు సంబంధించి వారం రోజుల్లో పెగ్ మార్కింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న భూములకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించి జెన్కో సీఎండీకి నివేదిక పంపిస్తామన్నారు. సమావేశంలో తాడిచర్ల ఎంపీటీసీ రావుల కల్పన, మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివా్సరావు, భూ నిర్వాసితులు అక్కపాక సమ్మయ్య, బండి రాజయ్య, ఆర్ని సత్యనారాయణ, రామిడి గట్టయ్య, బండారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.