కేయూ పీజీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2021-06-26T04:59:58+05:30 IST
కేయూ పీజీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్, జూన్ 25 : కాకతీయ యూనిర్సిటీ ఎం ఏ, ఎంకాం, ఎంఎస్సీ ఇతర పీజీ కోర్సుల మొదటి, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫీజులు చెల్లించుకునే గడువును జూలై 1 వరకు పొడిగించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో జూలై 5వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వివరాలకు కేయూ వెబ్సైట్ ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽ లో చూవాలని కోరారు. అలాగే ఎంబీఏ, ఎంసీఏ రెండో ఏడాది రెండో సెమిస్టర్, బీఈడీ మొదటి ఏడాది మొదటి సెమిస్టర్, రెండో ఏడాది రెండో సెమిస్టర్, బీపీఈడీ రెండో ఏడాది రెండో సెమిస్టర్, ఎంపీఈడీ సెండియర్ రెండో సెమిస్టర్ కోర్సుల ఫీజులను గడవును జూలై 1 వరకు పొడిగించామని తెలిపారు. జూలై 8 వరకు రూ.250 అపరాధ రుసుముతో చల్లించుకోవచ్చని పేర్కొన్నారు.
బీఫార్మసీ మొదటి సెమిస్టర్ ఫీజు గడువు 5
కేయూ బీఫార్మసీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫీజులను జూలై 5 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో జూలై 8 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వివరాలకు కేయూ వెబ్సైట్ ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽ లో చూడలని కోరారు.
సీబీసీఎస్, నాన్ సీబీసీఎస్ విద్యార్థులకు..
కేయూ బీఫార్మసీ సీబీసీఎస్, నాన్ సీబీసీఎస్ విద్యార్థులు మొదటి, ఎనిమిదో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫీజులను జూలై 5 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి ప్రొ ఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. రూ.250 అపరాధ రుసుంతో జూలై 8 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. వివరాలకు వెబ్సైట్ ఠీఠీఠీ.జ్చుజ్చ్టుజీడ్చ.్చఛి.జీుఽ లోచూడలని కోరారు.