కేఆర్ఎంబీ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ అధికారులు

ABN , First Publish Date - 2021-08-26T03:43:52+05:30 IST

కేఆర్ఎంబీ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ అధికారులు

కేఆర్ఎంబీ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ అధికారులు

హైదరాబాద్: సెప్టెంబర్ 1న జరగబోయే కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణా జలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసిఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటివాటా కోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని పునురుద్ఘాటించారు. సాధికారిక సమాచారంతో కేఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

Updated Date - 2021-08-26T03:43:52+05:30 IST