అడిషనల్ కలెక్టర్లకు కియా కొత్త కార్లు
ABN , First Publish Date - 2021-06-14T17:16:36+05:30 IST
అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో జిల్లా అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా కార్నివాల్ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రగతి భవన్లో వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎస్ సోమేష్ కుమార్ నిర్వహించారు. ఆర్టీయే ద్వారా కొనుగోలు చేసిన వాహనాలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని 32 జిల్లాలో అడిషనల్ కలెక్టర్లకు కొత్త కియా వాహనాలను ప్రభుత్వం అందజేయనుంది.