Khammam: పాత కక్షలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-08-11T12:46:41+05:30 IST
కారేపల్లి మండలంలోని గుంపేళ్లగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షలతో ఇరువర్గాలు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతమైన
ఖమ్మం: కారేపల్లి మండలంలోని గుంపేళ్లగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షలతో ఇరువర్గాలు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతమైన వాతావరణం చోటు చేసుకుంది. ఒకరినొకరు పిడుగుద్దులతో ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో చుట్టు ప్రక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇరువర్గాల దాడిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.