పామాయిల్ సాగులో ఖమ్మం జిల్లా రాష్ట్రానికి తలమానికంగా ఉంది: అజయ్
ABN , First Publish Date - 2021-08-14T21:48:20+05:30 IST
గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 53 వేల ఎకరాల్లో మిర్చి సాగు జరిగితే నేడు లక్ష ఎకరాల్లో సాగు జరుగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
ఖమ్మం: గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 53 వేల ఎకరాల్లో మిర్చి సాగు జరిగితే నేడు లక్ష ఎకరాల్లో సాగు జరుగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పామాయిల్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రానికి తలమానికంగా ఉందన్నారు. మల్చింగ్, డ్రిప్పుల ద్వారా రైతులు అధునాతన వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను మరింత ముందుకు నడిపించేందుకు సీఎం కేసీర్ కృషిచేస్తున్నారని పువ్వాడ అజయ్ తెలిపారు.