ఈసారి ముందస్తుకు వెళ్లడం లేదు: కేసీఆర్
ABN , First Publish Date - 2021-10-17T23:02:24+05:30 IST
ఈసారి మనం ముందస్తుకు వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హుజురాబాద్
హైదరాబాద్: ఈసారి మనం ముందస్తుకు వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై కేసీఆర్ చర్చించారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజాగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రోజూ 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈసారి మనం ముందస్తుకు వెళ్లడం లేదని, మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని తెలిపారు. ఇంకా రెండేళ్లు ఉందని, అన్ని పనులు చేసుకుందామన్నారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27 హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచార సభ నిర్వహించనున్నారు.