ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటీ
ABN , First Publish Date - 2021-09-03T23:41:30+05:30 IST
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు కేసీఆర్ చర్చించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపినట్లు
న్యూఢిల్లీ: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని నివాసంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు కేసీఆర్ చర్చించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు. మొత్తంగా 16 అంశాలపై ప్రధాని మోదీకి కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఐపీఎస్ల సంఖ్యపెంపు, కొత్తజిల్లాలకు ఐపీఎస్ల కేటాయింపు, హైదరాబాద్- నాగ్పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. పీఎంజీఎస్వైకి అదనపు నిధులు కేటాయింపు, కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని మోదీతో విన్నవించారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్కు ఐఐటీ, వరంగల్లో టెక్స్టైల్ పార్క్కు రూ.1,000 కోట్లు మంజూరు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి తగిన రీతిలో సహకరించాల్సిందిగా కేసీఆర్ కోరారు.