Kalyana Lakshmi అక్రమార్కులపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-10-31T12:34:23+05:30 IST
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లబ్ధి పొందేందుకు తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేసిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి తెలిపారు
![Kalyana Lakshmi అక్రమార్కులపై కేసు నమోదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నల్గొండ: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద లబ్ధి పొందేందుకు తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేసిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు కేతేపల్లి ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి తెలిపారు. మండలంలోని ఉప్పలపహాడ్, తుంగతుర్తి గ్రామాల్లో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేశారని చెప్పారు. దరఖాస్తుల పరిశీలనలో రెండు గ్రామాల్లోని బాలికల పేర్లతో వారి తల్లిదండ్రులు తప్పుడు ధ్రవీకరణ పత్రాలు ఇచ్చినట్టు తేలిందన్నారు. తహసీల్దార్ డి.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశామన్నారు.