బీజేపీ అంటే బిగ్ జోకర్స్ పార్టీ: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ABN , First Publish Date - 2021-08-22T19:19:32+05:30 IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ.. అంటే బిగ్ జోకర్స్ పార్టీగా మారిందన్నారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ పసువు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన ఫేక్ ఎంపీ అరవింద్ అని...అలాంటి అరవింద్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, హరీష్రావుల గురించే మాట్లాడేస్థాయి లేదన్నారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలున్న అర్వింద్.. ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తారా? అని ప్రశ్నించారు.
అవినీతి గురించి అరవింద్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని జీవన్రెడ్డి అన్నారు. 28 మంది అవినీతిపరులను దేశం దాటించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. జైలుకెళ్లిన రేవంత్ కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు, నియంత, కుటుంబ పాలన అనడం తప్ప కాంగ్రెస్, బీజేపీలకు ఏదీ చేత కాదని ఎద్దేవా చేశారు. అరవింద్కు దమ్ముంటే మోదీతో మాట్లాడి పసుపు బోర్డు తెప్పించాలని సవాల్ చేశారు. బీజేపీ ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.