జగన్ ఆకతాయి పిల్లాడిలా చేస్తున్నారు: Jagadeesh reddy
ABN , First Publish Date - 2021-07-15T22:09:06+05:30 IST
జగన్ ఆకతాయి పిల్లాడిలా చేస్తున్నారు: Jagadeesh reddy
సూర్యాపేట: ఇరు రాష్ట్రాల నీటి వాటాల విషయంలో ముందుగా సుప్రీంకోర్టును తామే ఆశ్రయించామని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇప్పుడు మళ్లీ కోర్టుని ఆశ్రయిస్తోందన్నారు. శ్రీశైలం, సాగర్ నీటిని ఉమ్మడి పాలనలో ఇష్టారీతిన వాడుకుని తెలంగాణ ప్రజలను వలసపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలను కోరడం ఏపీ ప్రభుత్వం చేతగానితనమన్నారు. స్నేహహస్తాన్ని అందుకోలేక జగన్ ఆకతాయి పిల్లాడిలా చేస్తున్నారని విమర్శించారు.