వ్యాసరచన పోటీలకు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-09-07T17:40:48+05:30 IST
తెలంగాణ రాష్ట్ర హరితదళం ఆధ్వర్యంలో..
జనగామ కల్చరల్: తెలంగాణ రాష్ట్ర హరితదళం ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాసరచన పోటీలకు విద్యార్థుల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా హరిత దళ సమన్వయ కర్త గౌసియాబేగం సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ’సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నివారణ మరియు ప్రత్యామ్నాయ మార్గాలు’ అనే అంశం పై నిర్వహించే వ్యాసరచన పోటీలలో 8 నుంచి 10 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు ఈ నెల 12వ తేదీ లోగా తమ రచనలను ఆన్లైన్ లో పంపించాలన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన మొదటి మూడు రచనలకు రూ.5 వేలు, రూ.3, వేలు, రూ.1 వేయి నగదు బహుమతులు అందిస్తామన్నారు. తెలుగు లేదా ఇంగ్లీషు మాధ్యమాలలో ఏ-4 సైజులో ఒకే పేజీలో 300 పదాలకు మించకుండా రాసి అప్లోడ్ చేయాలన్నారు. లింక్, వెబ్సైట్ వివరాలను 99635 63959 నంబరులో సంప్రదించి తెలుసుకోవాలన్నారు.