రాజన్న సేవలో అల్లోల
ABN , First Publish Date - 2021-03-09T20:57:33+05:30 IST
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దర్శించుకున్నారు.
రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా అల్లోల మాట్లాడుతూ.. రెండు వేలామంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహా శివరాత్రి జాతరలో పోలీసులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పై అధికారుల ఆదేశాలను అధికారులు తప్పకుండా పాటించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వర్తించాలని అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.