కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగుల వేతనాలు పెంపు
ABN , First Publish Date - 2021-11-28T09:16:43+05:30 IST
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎ్సఏ)లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.

హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ), సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 30 శాతం వేతనాలను పెంచుతూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శనివారం జీవో నెం.117ను విడుదల చేశారు. పెరిగిన వేతనాలు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు. జూలైలో అందజేేస వేతనంతో కలిపి ఇవ్వనున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ పాఠశాలలు, యూఆర్ఎస్, కేజీబీవీ ఉద్యోగులు దాదాపు 25 వేల వరకు ఉన్నట్లు వివరించారు. కాగా, సీఎం కేసీఆర్ గతంలో శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు వారి వేతనాలను పెంచినందుకు టీఎ్సయూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు.