నేను చెత్త ఓటరును.. నన్ను క్షమించకండి !

ABN , First Publish Date - 2021-11-30T08:59:54+05:30 IST

‘నన్ను క్షమించకండి. నేను చెత్త ఓటరును. డబ్బు తీసుకొని బీరు తాగి, బిర్యానీ తిని, టిఫిన్లు చేసి ఓటు వేశా. తాండూరు పట్టణ ప్రజల ఇబ్బందులకు కారణమైన ఓటర్ను నేను.

నేను చెత్త ఓటరును.. నన్ను క్షమించకండి !

ఓ యువకుడి వినూత్న నిరసన దీక్ష 

తాండూరు/తాండూరు రూరల్‌, నవంబరు 29 : ‘నన్ను క్షమించకండి. నేను చెత్త ఓటరును. డబ్బు తీసుకొని బీరు తాగి, బిర్యానీ తిని, టిఫిన్లు చేసి ఓటు వేశా. తాండూరు పట్టణ ప్రజల ఇబ్బందులకు కారణమైన ఓటర్ను నేను. జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయను. నా తప్పు తెలిసొచ్చేట్టు అందరూ నన్ను కొట్టండి’ అంటూ తనని తాను నిందించుకుంటూ చెప్పుల దండ వేసుకొని నిరసనకు దిగాడు వికారాబాద్‌ జిల్లా తాండూరు మం డలం అంతారానికి చెందిన రిజ్వాన్‌. చెప్పులు, బీరు బాటిళ్లతో మెడలో దండ వేసుకుని సోమవారం నిరసన దీక్ష చేపట్టాడు. ఈ సందర్భంగా రిజ్వాన్‌ మాట్లాడుతూ ‘ప్రజలారా.. ఇప్పటికైనా మే ల్కోండి. చైతన్యవంతులు కండి. నేను మారాను. బీరు, బిర్యానీ, డబ్బులకు లొంగకుండా పనిచేసే వారికే ఓటు వేయండి’ అని కోరాడు. తాండూరులో దుమ్ముధూళి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు పాడయ్యాయని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటర్లలో చైతన్యం రాకపోతే అంతా నష్టపోతామని హెచ్చరించాడు. ప్రజలు, కాంగ్రెస్‌ నాయకులతో కోడిగుడ్లతో కొట్టించుకున్నాడు. రోడ్డుపై పడుకొని జనాలతో తొక్కించుకున్నాడు. కాగా, రిజ్వాన్‌ దీక్షకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు ప్రకటించారు. 

Updated Date - 2021-11-30T08:59:54+05:30 IST