ఐఏఎస్ అధికారి 3 కార్ల దర్జా !
ABN , First Publish Date - 2021-07-08T08:31:10+05:30 IST
ప్రభుత్వ అధికారులకు అధికారికంగా ఎన్ని కార్లు ఉంటా యి? సాదారణంగా అయితే ఒకే కారు ఉంటుంది. మరీ అవసరం ఉందనుకుంటే మరొక కారు ఉం డొచ్చు.

విధుల్లో నిర్లక్ష్యం, ప్రజాధనం దుర్వినియోగం
హైదరాబాద్,జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారులకు అధికారికంగా ఎన్ని కార్లు ఉంటా యి? సాదారణంగా అయితే ఒకే కారు ఉంటుంది. మరీ అవసరం ఉందనుకుంటే మరొక కారు ఉం డొచ్చు. కానీ రాష్ట్రానికి చెందిన ఆ ఐఏఎస్ అధికారిగారు మాత్రం ప్రభుత్వ కోటాలో ఏకంగా మూ డు కార్లను వాడేస్తున్నారు. ఆయన గారి ఈ దర్జా వ్యవహారం ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఓ కీలకమైన కమిషన్. ప్రస్తుతం దానికి చైర్మన్, సభ్యులు లేరు. కమిషన్ కార్యదర్శి హోదా లో ఓ ఐఏఎస్ అధికారి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా ఒక కారు కేటాయించింది. దానిని వాడుకుంటున్నారు. కమిషన్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉండటం తో, ఆయన వాడాల్సిన కారును కూడా కార్యదర్శి వాడేస్తున్నారు. ఈ రెండు కార్లు చాలదన్నట్లు, క మిషన్ తరఫున అద్దెకు తీసుకున్న మరో కారును కూడా ఆయనే వినియోగిస్తున్నారు. ఈ కారును తన స్వస్థలం.. పొరుగు రాష్ట్రంలోని ఇంటి వద్ద అ వసరాలకు వినియోగిస్తున్నారు. ఆ కారు అద్దె కిం ద ప్రభుత్వం ప్రతి నెలా రూ.60వేల చొప్పున చెల్లిస్తోంది. ఇలా మూడు కార్ల దర్జా ఒలకబోస్తున్న ఈ అధికారి, రోజూ కార్యాలయానికి వస్తున్నారా అంటే అదీ లేదని ఆయన కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఆయన విధులకు ఎప్పుడు వస్తా రో తమకు కూడా తెలియదని చెబుతున్నారు. అయితే.. ఈ ఐఏఎస్ అధికారి నిర్వాకం ఇప్పటివరకు ఉన్నతాధికారుల దృష్టికి రాలేదని తెలుస్తోం ది. సాక్షాత్తూ ఒక ఐఏఎస్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటం విమర్శలకు తావిస్తోంది.