హైదరాబాద్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-20T18:03:01+05:30 IST
హైదరాబాద్ బంజారాహిల్స్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభోత్సవం నేడు జరిగింది. దేశంలోనే తొలి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.
![హైదరాబాద్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభోత్సవం నేడు జరిగింది. దేశంలోనే తొలి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.