ములుగు కలెక్టర్‌కు హెచ్‌ఆర్సీ నోటీసులు

ABN , First Publish Date - 2021-02-26T07:38:20+05:30 IST

సాగు చేసుకుంటున్న పోడు భూమిని అటవీ అధికారులు లాక్కుంటారేమోనన్న ఆందోళనతో గొత్తికోయ మహిళా బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ) సీరియస్‌ అయింది

ములుగు కలెక్టర్‌కు హెచ్‌ఆర్సీ నోటీసులు

గొత్తికోయ మహిళ ఆత్మహత్యపై సీరియస్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనం సుమోటోగా స్వీకరణ


సాగు చేసుకుంటున్న పోడు భూమిని అటవీ అధికారులు లాక్కుంటారేమోనన్న ఆందోళనతో గొత్తికోయ మహిళా బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ) సీరియస్‌ అయింది. మార్చి 30వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ములుగు కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధిలోని రాయబంధంలో పదం ఎర్రమ్మ ఆత్మహత్య చేసుకోగా.. గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. నాలుగు రోజుల క్రితం ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు యంత్రాలను తీసుకురావడంతో మనస్తాపానికి గురైన ఎర్రమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. 

Updated Date - 2021-02-26T07:38:20+05:30 IST