ఈనెల 19 నుంచి 23 వరకు ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో

ABN , First Publish Date - 2021-08-17T23:06:15+05:30 IST

ఈనెల 19 నుంచి 23 వరకు ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోను నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు.

ఈనెల 19 నుంచి 23 వరకు ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో

హైదరాబాద్: ఈనెల 19 నుంచి 23 వరకు ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షోను నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ మేళాను మంత్రి హరీష్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేళ 5 రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. గ్రాండ్ నర్సరీ మేళలో వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ ప్రదర్శనలో దాదాపు 140 స్టాళ్ల ఏర్పాటు చేస్తారు. ఈ మేళా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాగనుందని నిర్వాహకులు తెలిపారు.  

Updated Date - 2021-08-17T23:06:15+05:30 IST