రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను: హిమాన్షు
ABN , First Publish Date - 2021-07-07T08:34:18+05:30 IST
తాను రాజకీయాల్లోకి ఎప్పటికీ రానని ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు స్పష్టం చేశారు. తనకు రాజకీయాల మీద ఏమాత్రం
ఏమాత్రం ఆసక్తి లేదు.. నా లక్ష్యాలు వేరు
హైదరాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి): తాను రాజకీయాల్లోకి ఎప్పటికీ రానని ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు స్పష్టం చేశారు. తనకు రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని, తన కల వేరే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే నా లక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి’’ అని హిమాన్షు ట్విటర్లో రాశారు. ఈ ట్వీట్, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది. సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొనే హిమాన్షుకు ఇటీవలే డయానా అవార్డు వరించిన విషయం తెలిసిందే.