మండుతున్న సూరీడు.. గ్రేటర్ వాసుల బెంబేలు
ABN , First Publish Date - 2021-03-29T13:36:27+05:30 IST
గ్రేటర్లో సూర్య భగవానుడు మండిపోతున్నాడు...
హైదరాబాద్ : గ్రేటర్లో సూర్య భగవానుడు మండిపోతున్నాడు. ఉదయం 8నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండతీవ్రత అధికంగా ఉండడంతో చిరువ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్య మహారాష్ట్ర, పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నగరంలో అత్యధికంగా నారాయణగూడలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసి్ఫనగర్లో 39.3, న్యూ నాగోలు, ఆస్మన్ఘడ్లో 39.2, ఖైరతాబాద్ గణాంకభవన్లో 39.1, పాటిగడ్డ, కార్వాన్లో 39.0 డిగ్రీలు నమోదయ్యాయి. మొత్తంగా నగర వ్యాప్తంగా 39.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.