దళితబంధు ఎలా తప్పైంది: హరీష్రావు
ABN , First Publish Date - 2021-08-14T21:56:48+05:30 IST
హుజురాబాద్లో రైతుబంధు ఎలా ఒప్పైంది? దళితబంధు ఎలా తప్పైంది? అని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు.
హైదరాబాద్: హుజురాబాద్లో రైతుబంధు ఎలా ఒప్పైంది? దళితబంధు ఎలా తప్పైంది? అని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారని, తాము పది లక్షలు ఇస్తున్నాం, మిగతాది బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి తెప్పించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశంలో మరిన్ని నిధులు ఇచ్చి రాష్ట్రం అంతా ఇస్తామని మంత్రి ప్రకటించారు. కేంద్రం డబ్బులు ఇస్తే.. తాము కూడా పాలాభిషేకం చేస్తామని తెలిపారు. దళితబంధుపై బీజేపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని తప్పుబట్టారు. దళిత బంధును ఆపాలని ఈసీకి లేఖ రాశారని, కోర్టులో కేసు వేశారని హరీష్రావు విమర్శించారు.