తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు రోశయ్యతో చర్చించాం: హరీష్రావు
ABN , First Publish Date - 2021-12-04T17:44:42+05:30 IST
మాజీ సీఎం రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రోశయ్య భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన సీఎంగా ఉండగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరిగిందన్నారు. రోశయ్య హయాంలోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని హరీష్రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు రోశయ్యతో చర్చించామన్నారు. రోశయ్య చేయని పదవి.. పొందని గౌరవం లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.