బావిలో చిక్కుకుని...మూడు గంటల పాటు మృత్యువుతో పోరాటం
ABN , First Publish Date - 2021-11-17T15:33:28+05:30 IST
ఓ వ్యక్తి బావిలో చిక్కుకొని మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడి జయించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
హనుమకొండ: ఓ వ్యక్తి బావిలో చిక్కుకొని మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడి జయించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బావి ఓడలు కూలడంతో వెంకటేష్ అనే వ్యక్తి బాలిలోపలే శిథిలాల కింద చిక్కుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో బాధితుడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. జేసీబీ సహాయంతో బావి చుట్టూ తవ్వి వెంకటేష్ను పోలీసులు, గ్రామస్థులు బయటకు తీశారు. అనంతరం వెంకటేష్ను ఆస్పత్రికి తరలించారు.