హఫీజ్పేట్ భూమి వక్ఫ్బోర్డుదే
ABN , First Publish Date - 2021-01-12T08:54:10+05:30 IST
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేట సర్వేనెం.80లోని భూముల్లో 140 ఎకరాలు వక్ఫ్బోర్డుకు చెందినవేనని దర్గా హజ్రత్ సాలార్-ఎ-అవులియా ముతావలీ సజ్జాదా నషీన్ సుల్తాన్ అహ్సన్-ఉద-దౌలా

బీజేపీ నేతల ఆరోపణలు నిరాధారం: సాలారే ఔలియా ముతావలీ
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్పేట సర్వేనెం.80లోని భూముల్లో 140 ఎకరాలు వక్ఫ్బోర్డుకు చెందినవేనని దర్గా హజ్రత్ సాలార్-ఎ-అవులియా ముతావలీ సజ్జాదా నషీన్ సుల్తాన్ అహ్సన్-ఉద-దౌలా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కంకణబద్ధులై ఉన్నారని, ప్రవీణ్కుమార్కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని గుర్తుచేశారు.