జీపీఏల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలు జారీ
ABN , First Publish Date - 2021-02-05T08:59:01+05:30 IST
వ్యవసాయ భూములకు సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) రిజిస్ట్రేషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ధరణి పోర్టల్లో జీపీఏల కోసం రైతులు/భూముల యాజమానులు దరఖాస్తు చేసుకుంటే...
![జీపీఏల రిజిస్ట్రేషన్ మార్గదర్శకాలు జారీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
వ్యవసాయ భూములకు సంబంధించిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) రిజిస్ట్రేషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ధరణి పోర్టల్లో జీపీఏల కోసం రైతులు/భూముల యాజమానులు దరఖాస్తు చేసుకుంటే.. నిర్ణీత సమయంలో తహసీల్దార్ ముందు వారు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత పత్రాలను పరిశీలించి..జీపీఏను తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయనున్నారు. జీపీఏ, ఏజీపీఏ(అగ్రిమెంట్ సేల్ కమ్ పవర్ ఆఫ్ అటార్నీ), డీజీపీఏ(డెవల్పమెంట్ అగ్రిమెంట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ), ఎస్పీఏ(స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ)లకు అవకాశం ఇవ్వాలని రెండు నెలలుగా భూ యాజమానులు కోరుతున్నారు.