ప్రిన్సిపల్ల నియామకాల్లో ‘గెస్ట్’లనూ తీసుకోవాలి: షర్మిల పార్టీ
ABN , First Publish Date - 2021-04-21T09:47:55+05:30 IST
గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ల నియామకాల్లో గెస్ట్ లెక్చరర్లనూ పరిగణనలోకి తీసుకోవాలని టీఎ్సపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ సాయిలుకు షర్మిల పార్టీ ముఖ్యనేత ఇందిరాశోభన్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): గురుకుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాళ్ల నియామకాల్లో గెస్ట్ లెక్చరర్లనూ పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ సాయిలుకు షర్మిల పార్టీ ముఖ్యనేత ఇందిరాశోభన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించా రు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని ఇందిరాశోభన్ తెలిపారు.