రాష్ట్రానికి రూ.1,264.78 కోట్ల ‘జీఎస్టీ’ రుణం
ABN , First Publish Date - 2021-10-29T08:32:58+05:30 IST
రాష్ట్రానికి రూ.1,264.78 కోట్ల ‘జీఎస్టీ’ రుణం
న్యూఢిల్లీ, హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ పరిహారానికి బదులుగా తిరిగి చెల్లించే రుణం కింద రాష్ట్రానికి రూ.1,264.78 కోట్లు విడుదలయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ గురువారం 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.44,000 కోట్ల బ్యాలెన్స్ నిధులను విడుదల చేసింది.