అక్టోబరు 7న నల్లగొండకు గవర్నర్
ABN , First Publish Date - 2021-09-30T01:09:41+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబరు 7వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.
నల్లగొండ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబరు 7వ తేదీన నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ప్రారంభించేందుకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ. రంగనాథ్లు బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు, రెడ్క్రాస్ సిబ్బంది సమీక్షకు సమాయత్తమవుతున్నారు.